Monday, 27 July 2026 12:48:17 AM
# నవనీత రూప అలంకరణలో శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి # పల్నాడు జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుక # బిజెపి ఆధ్వర్యంలో మన మహిళా-మన ఆత్మ గౌరవం # నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్

మహాశివరాత్రి సందర్భంగా అమరలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు

Date : 13 February 2026 04:47 PM Views : 168

VM Today News - భక్తి / పల్నాడు : పల్నాడు జిల్లా గురజాల మండలం దైద గ్రామ మార్గం నుంచి సుమారు 5 కి.మీ దూరంలో అటవీ ప్రాంతంలో ఈ శైవ క్షేత్రం ఉంది. వాడపల్లిలో అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన అగస్త్యేశ్వరస్వామి క్షేత్రానికి సమీపంలో ఈ బిలం ఉన్నట్లు చెబుతారు. ఈ బిలాన్ని అగస్త్య మహర్షి తపస్సు కోసం ఉపయోగించారని స్థానికులు విశ్వసిస్తున్నారు. సుమారు 120 సంవత్సరాల క్రితం పులిపాడు గ్రామస్థులు ఈ బిలాన్ని గుర్తించారు. కాండ్ర రామయ్య, పోట్ల హనుమయ్య పశువులు మేపుతుండగా మంత్రోచ్చారణలు వినిపించాయి. శబ్దం వచ్చిన దిశగా వెతికిన వారు బండరాళ్ల మధ్య బిలద్వారం గుర్తించారు. గ్రామస్థుల సహాయంతో తాడులు కట్టి బిలంలోకి ప్రవేశించారు. ఇరుకైన మార్గంలో కొంతదూరం వెళ్లగా దివ్య లింగాకారం దర్శనమిచ్చిందని చెబుతారు. అక్కడ పూజలు జరిగిన ఆనవాళ్లు కూడా గమనించినట్లు తెలిపారు. ఆ రోజునుంచి ఆ బిలంలోని శివలింగం శ్రీ అమరలింగేశ్వరస్వామిగా పూజలు అందుకుంటోంది. భక్తుల రాకతో ఆ క్షేత్రం విశేష ప్రాచుర్యం పొందింది. మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. ఆలయ అర్చకులు సంజీవ్ కుమార్ మహాశివరాత్రి మహిమను వివరించారు.


M kannaiah

Reporter

VMToday News

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: